వామ్మో.. ఒకేసారి 10 సినిమాలు

  • January 27, 2021 / 09:26 PM IST

ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే అది పూర్తయ్యే వరకు మరో సినిమాను స్టార్ట్ చేయరు కొందరు నిర్మాతలు. కానీ ఈ రోజుల్లో ఒకేసారి 10సినిమాలను లైన్ లో పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో జాగ్రత్తగా వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా ఈ రేంజ్ లో ప్రొడ్యూస్ చేయడం లేదు.

మైత్రి మూవీ మేకర్స్ ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో వీళ్ళు సినిమాలను ఓవర్సీస్ లో రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. అనంతరం కొరటాల శివ ద్వారా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లతో టాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం వీరి ప్రొడక్షన్ 10 సినిమాలు ఉండగా అందులో కొన్ని రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, అంటే సుందరినికి వంటి సినిమాలతో పాటు బాలకృష్ణ – గోపిచంద్ మలినేని, కొరటాల శివ – రామ్ చరణ్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, చిరంజీవి – బాబీ, విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ, పవన్ కళ్యాణ్, హరీష్ కంకర్ వంటి కాంబినేషన్స్ ను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుగుతున్నాయట. మరి భవిష్యత్తులో ఇంకా ఎంత పెద్ద సినిమాలను సెట్స్ పైకి తెస్తారో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus