అమ్మ బయోపిక్ బాధ్యత నాదే..ఆ హక్కు ఎవ్వరికీ లేదు: నరేష్

  • April 30, 2020 / 07:55 PM IST

నటి విజయ నిర్మల జీవితం అద్భుతం. ఓ వ్యక్తిగా అనేక విజయాలను ఆమె అందుకున్నారు. మేల్ డామినేటెడ్ సొసైటీలో వాళ్లకు గట్టి పోటీ ఇచ్చిన మహిళా మణి. నటిగా, దర్శకురాలి, నిర్మాతగా ఆమె అనేక రంగాలలో రాణించారు. డైరెక్టర్ గా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన ఒకే ఒక్క వనిత. ఇందుకు గాను 2002లో విజయ నిర్మల గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పారు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న విజయ నిర్మల 1969లో సూపర్ స్టార్ కృష్ణను వివాహం చేసుకున్నారు.

అప్పటి నుండి వీరిద్దరూ అన్యోన్య దంపతులుగా ఆమె మరణం వరకు కలిసి బ్రతికారు. ఎవరి జీవితంలో ఇంతకు మించిన సినిమా మెటీరియల్, నాటకీయత ఉంటుంది. అందుకే ఆమె మరణం అనంతరం బయోపిక్ అనేది చాలా మంది దర్శకుల హాట్ ఫేవరేట్ సబ్జెక్టు అయ్యింది. ఇక కొద్దిరోజులలో విజయ నిర్మల బయో పిక్ సెట్స్ పైకి వెళుతున్నట్టు, అందులో విజయ నిర్మలగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విజయ నిర్మల కుమారుడు నటుడు నరేష్ స్పందించారు.

అమ్మ విజయ నిర్మల బయో పిక్ తెరకెక్కించే హక్కులు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. విజయ నిర్మల బయో పిక్ తెరకెక్కనుంది అని వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన అన్నారు. ఇక బ్రతికి కున్న రోజులలో ఆమె నరేష్ తో తన బయో పిక్ తెరకెక్కించాలని కోరారట. దీనితో ఆయనే స్వయంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడాని ఏడాదికి పైనే పడుతుందని నరేష్ స్పష్టత ఇచ్చారు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus