రాయుడు చిత్రాలు బ్యానర్‌పై నిఖిల్‌ విజయేంద్ర, నిహారిక ప్రధాన పాత్రల్లో వెబ్‌ సిరీస్‌ ప్రారంభం

  • January 8, 2021 / 02:40 PM IST

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో కొత్త వెబ్‌ సిరీస్‌ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. యూ ట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర ఇందులో నటిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలను నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిచారు. స్టార్‌ రైటర్‌ విజయేందప్రసాద్‌,

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శక నిర్మాత భాను రాయుడుకి స్ట్రిప్ట్‌ను అందించారు. యంగ్‌ ప్రొడ్యూసర్‌ హర్షిత్‌ రెడ్డి బ్యానర్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత భాను రాయుడు మాట్లాడుతూ “ప్రస్తుతం డిజిటల్‌ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే. కొత్త కాన్సెప్టులతో వెబ్‌ సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఆ కోవలో మా రాయుడు చిత్రాలు బ్యానర్‌పై ఫాంటసీ డ్రామా జోనర్‌లో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించడానికి కథను సిద్ధం చేశాం.

ఎవరూ సరిపోతారని ఆలోచించాం. నిహారికగారైతే మా కథకు న్యాయం చేస్తారనిపించి ఆమెను సంప్రదించి కథ వినిపించాం. ఆమె ఓకే చెప్పారు. అలాగే ప్రముఖ యూ ట్యూటర్‌ నిఖల్‌ విజయేంద్ర ఇందులో నటిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ అనసూయగారు కీలక పాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే మా వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది” అన్నారు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus