సాయిధరమ్ తేజ్ తో పాటు నిధి అగర్వాల్ కూడా..!

  • February 2, 2023 / 10:04 PM IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ లేటెస్ట్ ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తూ ఊరిస్తున్నారు మేకర్స్. రెండు ఎపిసోడ్లుగా విడుదల చేస్తున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. మొదటి ఎపిసోడ్ ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఫిబ్రవరి 2 నైట్ 9 గంటల నుండి ప్రీమియర్స్ టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం.

మొదటి ఎపిసోడ్లో పవన్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మూడు పెళ్లిళ్ల వ్యవహారం గురించి బాలయ్య డైరెక్ట్ గా అడిగేశారు. దీనికి సంబంధించిన విజువల్ కూడా ప్రోమోలో ఉంది. అలాగే పవన్ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సంగతిని కూడా బాలయ్య గుర్తుచేశారు. ఇక మధ్యలో సాయి ధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇచ్చి హైలెట్ గా నిలిచాడు. అయితే షోలో స్పెషల్ ఎలిమెంట్స్ ఇంకా చాలా ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ ఎపిసోడ్లో కనిపించబోతున్నట్టు టాక్. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో ఆమె ముచ్చటించినట్టు సమాచారం. ‘హరి హర వీర మల్లు’ లో తన పాత్ర గురించి మాత్రమే కాకుండా పలు ఆసక్తికర విషయాలు బాలయ్యతో పంచుకుంటుందట నిధి అగర్వాల్. ఇక ‘హరి హర వీర మల్లు’ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus