నిఖిల్ భార్య పల్లవి వర్మ సీమంతం వేడుక ఫోటో వైరల్.!
February 1, 2024 / 10:49 AM IST
|Follow Us
యంగ్ హీరోలలో నిఖిల్ భార్య పల్లవి ఇప్పుడు నిండు గర్భిణీ అనే సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతపు వేడుకని ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోని నిఖిల్ తన ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది. ‘సీమంతం .. బేబీ షవర్ యొక్క సాంప్రదాయ భారతీయ రూపం’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడమే కాకుండా… ‘అతి త్వరలో మేము మా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాము అని తెలియజేసేందుకు కూడా సంతోషిస్తున్నాము.
దయచేసి మీరంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. నిఖిల్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ‘కంగ్రాట్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిఖిల్- పల్లవి …లు 2020 లో కోవిడ్ టైంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. ఇక ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్…. ఆ తర్వాత చేసిన ’18 పేజెస్’ ‘స్పై’ వంటి వాటితో అనుకున్న ఫలితాలను అందుకోలేకపోయారు.
ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను చాలా కష్టపడుతున్నాడు. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు.. వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. అలాగే ‘కార్తికేయ 3 ‘ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది.ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv