టాలీవుడ్ ప్రొడ్యూసర్ పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్!

  • March 13, 2021 / 06:25 PM IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మే 28న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి విజయాల తరువాత వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏడేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను రవీందర్ రెడ్డి నిర్మించారు. ఆ సమయంలో తనను మోసం చేసి అగ్రిమెంట్ ని కన్సిడర్ చేయకుండా.. వేరే వారిని సినిమా రైట్స్ అమ్మేశారని అమెరికా డిస్ట్రిబ్యూటర్ రవీందర్ పై ఆరోపణలు చేశారు. తన దగ్గర నుండి తీసుకున్న రూ.50 లక్షలు తిరిగి చెల్లించలేదని.. దీని వలన తాను చాలా నష్టపోయానని పేర్కొంటూ రవీందర్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు.

కొన్నాళ్లుగా కోర్టులో నలుగుతున్న కేసు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేస్తూ ప్రత్తిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న రవీందర్ రెడ్డిని కోర్టులో హాజారు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ కేసు నుండి రవీందర్ రెడ్డి ఎలా బయటపడతారో చూడాలి!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus