ఎన్టీఆర్ అభిమానులకు షాక్!!!

  • November 18, 2016 / 07:06 AM IST

టాలీవుడ్ లో యంగ్ టైగర్ స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో నిన్ను చూడాలని సినిమాతో తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్ ఆ తరువాత అతి చిన్న వయసులోనే సూపర్ హీరోగా అవతరించిన విషయం తెలిసిందే…ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తీసిన సింహాద్రి ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ ను విపరీతంగా తెచ్చిపెట్టింది. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ వరుస హిట్స్ తో ఇండస్ట్రీని శాసించే స్థాయికి దూసుకుపోయాడు….ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ మూడు సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు…టెంపర్ సినిమాను మొదలు కుండి మొన్న వచ్చిన జనతా గ్యారేజ్ వరకూ ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్ కొట్టి మళ్ళీ తన స్టామినాను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు….అయితే జనతా గ్యారెక్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తున్నాడో అన్న టెన్షన్ లో ఉన్న ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు వరుసగా సైన్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయినట్లు టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం…ఇక ఆ వివరాలు చూస్తే..అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన ఎన్టీఆర్ అదే స్పీడ్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అంతేనా తమిళ దర్శకులు హరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక టెంపర్ తర్వాత పూరి తో మరో సినిమా కి కమిట్ మెంట్ అయ్యాడట. వీటితో పాటు మరో ఒకటి రెండు ప్రాజెక్ట్ లు కూడా లైన్లో ఉన్నాయట. అయితే ఈ వరుస సినిమాల పరంపరను అనిల్ రావిపూడి సినిమాతో మొదలు పెట్టనున్నాడు ఎన్టీఆర్. ఏది ఏమైనా…యంగ్ టైగర్ మళ్ళీ పట్టాలు ఎక్కాడు అంటున్నారు ఫ్యాన్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus