జనతా గ్యారేజ్ తర్వాత వేగం పెంచనున్న తారక్

  • November 1, 2016 / 08:10 AM IST

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన మౌనం వెనుక రహస్యాన్ని చేధించలేక సినీ ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. కానీ ఫిల్మీ ఫోకస్ కి అందిన సమాచారం ప్రకారం హ్యాట్రిక్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తారక్ స్పీడ్ పెంచనున్నట్లు తెలిసింది. ఒకే చిత్రాన్ని ఆరు నెలల పాటు చేయకుండా.. అదే సమయంలో రెండు, మూడు చిత్రాలను చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందించతగ్గ విశేషం ఏమిటంటే .. ఇక నుంచి తారక్ తెలుగు భాషకే పరిమితం కావాలని అనుకోవడం లేదు. మలయాళం, తమిళం పరిశ్రమలపై దృష్టిపెట్టారు. ఏకకాలంలో రెండు, మూడు భాషల్లో తన చిత్రాన్ని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అందుకే కథలు ఎంపిక చేయడానికి ఆలస్యమైందట. త్వరలోనే తాను చేయబోయే రెండు ప్రాజక్ట్ ల వివరాలను ఎన్టీఆర్  వెల్లడించి షాక్ ఇవ్వనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus