మళ్ళీ రచ్చ మొదలెట్టిన శ్రీరెడ్డి, ఈసారి టార్గెట్ ఎవరు?
- November 27, 2018 / 12:41 PM ISTByFilmy Focus
కొన్ని నెలల ముందు శ్రీరెడ్డి చేసిన రచ్చని ఇప్పటివరకూ జనాలెవరూ మర్చిపోలేదు. ఆమె గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా.. ప్రపంచవ్యాప్తంగా “మీ టూ” అనే మూమెంట్ మొదలవ్వడానికి కారణం మాత్రం ఆమే. అయితే.. ఈమధ్య తమిళంలో వరుస సినిమా ఆఫర్లు అందుకున్న శ్రీరెడ్డి మళ్ళీ తనదైన శైలిలో రచ్చ మొదలెట్టింది. “తనను నిన్నమొన్నటివరకూ అందరూ పబ్లిక్ టాయిలెట్ లా వాడుకున్నారని, ఇప్పటికీ ఆ గాయాలు మానలేదు, ఎప్పటికీ మానవు కూడా. ఇప్పుడిప్పుడే ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న నన్ను తోక్కేయాలని ఓ టాప్ తమిళ హీరో ప్రయత్నిస్తున్నాడు.
ఆ తమిళ హీరో పెద్ద కామ పిశాచి, త్వరలోనే అతడి రహస్యాలను బయటపెడతాను. అప్పుడు కానీ.. ఆ హీరో పరువు పోయి క్రుంగిపోవడం మొదలవ్వదు” అంటూ తన ఫేస్ బుక్ లో ఒక పెద్ద పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఆమె టార్గెట్ చేసింది ఎవర్ని అనేది అందరికీ అర్ధమవుతున్నప్పటికీ.. ఎవరూ నోరు మెదపడం లేదు. మరి ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుంది అనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.













