చెరుకూరి మోహన్ సొంత కుంపటి!

  • June 4, 2021 / 03:40 PM IST

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో టాలీవుడ్ లో జర్నీ మొదలుపెట్టింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై రవిశంకర్ కలిసి ఈ బ్యానర్ ను స్టార్ట్ చేశారు. మొదట్లో ఒక సినిమా తరువాత మరొకటి అన్నట్లుగా సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని ఇలా చాలా మంది హీరోలతో సినిమాలు సెట్ చేసుకుంది.

యంగ్ హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తోంది. మైత్రి సంస్థలో దాదాపు ఇరవై సినిమాలను నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సంస్థ నుండి చెరుకూరి మోహన్ బయటకి వచ్చేసినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన మైత్రి సంస్థ నుండి సెపరేట్ అయినట్లు సమాచారం. ఇప్పుడు తనే సొంతంగా ప్రొడకషన్ హౌస్ ను మొదలుపెట్టబోతున్నారట. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, వైష్ణవ్ తేజ్ లాంటి వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు.

అలానే పలువురు దర్శకులను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమాలను లైనప్ చేయడంతో మైత్రి స్ట్రాటజీనే వాడుతున్నారు మోహన్ చెరుకూరి. మరి భవిష్యత్తులో తన స్నేహితులకు పోటీనివ్వగలడో లేదో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus