Pallavi Prashanth: ఆ విషయంలో పల్లవి ప్రశాంత్ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

  • March 15, 2024 / 05:58 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్ బాస్ షో విజేతగా నిలవడం ద్వారా వచ్చిన డబ్బును రైతులకు, పేదలకు డొనేట్ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా పల్లవి ప్రశాంత్ అడుగులు వేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ తాజాగా చేసిన మంచి పని నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. గజ్వేల్ లోని కొలుగూరు గ్రామానికి చెందిన పేద రైతు ఫ్యామిలీకి పల్లవి ప్రశాంత్ లక్ష రూపాయలు ఇచ్చారు.

తల్లీదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం డబ్బు సహాయం చేయడంతో పాటు సరిపడా బియాన్ని సైతం ప్రశాంత్ అందజేయడం గమనార్హం. సందీప్ మాస్టర్ సైతం ఆ పేద రైతు కుటుంబానికి తన వంతుగా 25 వేల రూపాయల సహాయం చేశారు. పల్లవి ప్రశాంత్, సందీప్ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. ప్రాణం పోయినా మాట తప్పనని మీకు ఇచ్చిన మాట కోసం ముందుగా చేసిన సహాయం లక్ష రూపాయలు అని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.

ఏడాదికి సరిపడా బియ్యం రైతు కుటుంబానికి అందజేస్తున్నానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. మీ ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలతో ప్రేక్షకుల ముందుకొస్తానని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు. థాంక్యూ ఆల్ అంటూ పల్లవి ప్రశాంత్ తన పోస్ట్ ను ముగించారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ రాబోయే రోజుల్లో ఎంతోమందికి సహాయం చేసి కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పల్లవి ప్రశాంత్ చేస్తున్న మంచి పనులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజంగా కష్టాల్లో ఉన్న రైతులకు పల్లవి ప్రశాంత్ సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎంతోమందికి పల్లవి ప్రశాంత్ స్పూర్తి అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అవుతూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus