ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కథను సిద్ధం చేస్తున్న కొరటాల శివ

  • September 30, 2016 / 02:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది. అందుకే పవన్ 2019 లోపున ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్న పవన్, ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. దాని తర్వాత దాసరి నారాయణరావు బ్యానర్లో నటించేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పుడు అయన కోసం మరో కథ రెడీ అవుతోంది. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూ తన కంటూ ఒక ముద్రను వేసుకున్న కొరటాల శివ జనసేన అధినేత కోసం రాజకీయ నేపథ్యంలో సాగే ఓ కథను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది.

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ .. వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తీసిన ఈ డైరక్టర్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం స్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ప్రిన్స్ సినిమా జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఓ వైపు మహేష్ చిత్ర పనుల్లో ఉండగానే పవర్ స్టార్ కి కథ చెప్పి ఒప్పించాలని శివ ప్లాన్ చేస్తున్నారు. గతంలోనూ జనతా గ్యారేజ్ షూటింగ్ విరామంలో మహేష్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్న కొరటాల ఇప్పుడు కూడా అదే విధంగా అడుగులు వేస్తున్నారు. హిట్ ట్రాక్ ఉన్న ఈ డైరక్టర్ తో పనిచేయడానికి పవన్ అంగీకరిస్తారని అయన సన్నిహితులు చెబుతున్నారు.  వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus