Pawan Kalyan: నితిన్- వక్కంతం ప్రాజెక్టు వెనుక పవన్ హస్తం?

  • July 8, 2021 / 05:08 PM IST

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో దర్శకుడిగా మారిన స్టార్ రైటర్ వక్కంతం వంశీకి.. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది. ఆ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో.. ఇతనికి మూడేళ్ళుగా అవకాశాలు లేకుండా పోయాయి. చాలా మంది హీరోలకి కథలు వినిపించాడు వంశీ. ఇంతకాలం అతను ‘గీత ఆర్ట్స్’ కాంపౌండ్లో పనిచేస్తూ వచ్చినట్టు వినికిడి. ఇది పక్కన పెడితే.. మొత్తానికి నితిన్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు వక్కంతం వంశీ.

ఠాగూర్ మధుతో కలిసి నితిన్ సొంత బ్యానర్ అయిన ‘శ్రేష్ట్ మూవీస్’ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నట్టు భోగట్టా..! అంతేకాదు ఈ చిత్రంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు కూడా టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. నితిన్ ఈ ప్రాజెక్టుని ఒప్పుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ పుషింగ్ ఉందనేది ఇన్సైడ్ టాక్. నిజానికి ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో పవన్ కళ్యాణ్ హీరోగా వక్కంతం వంశీ ప్రాజెక్టు సెట్ అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చాలా బిజీ.

అతను కమిట్ అయిన 3 సినిమాలను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీంతో వక్కంతం వంశీతో మూవీ చేయమని నితిన్ కు పవన్ సూచించనట్టు తెలుస్తుంది. ‘పవర్ పేట’ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయ్యింది కాబట్టి.. వక్కంతం వంశీతో సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నితిన్. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. నితిన్ పూర్తి స్క్రిప్ట్ వినకుండానే వక్కంతంతో సినిమా చేయడానికి ఓకే చెప్పేసాడట. అది బహుశా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో కావచ్చు..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus