Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?
- May 15, 2026 / 03:22 PM ISTByFilmy Focus Desk
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. గ్రామీణ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Peddi
ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ ప్రమోషనల్ కార్యక్రమాలకు దూరంగా ఉండబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఆమె పాత్రకు పరిమిత ప్రాధాన్యం మాత్రమే ఉందని, అందుకే ప్రమోషన్స్లో పెద్దగా కనిపించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.

ఇక జాన్వీ కపూర్కు తెలుగు ఇండస్ట్రీలో ఇది ఎంతో కీలకమైన ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో వరుస అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు, ‘పెద్ది’ చిత్రం విజయవంతమైతే మరిన్ని భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్కు దూరంగా ఉండటం ఆమె కెరీర్కు మైనస్ అయ్యే అవకాశం ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని సమాచారం. సంగీతాన్ని ఏ ఆర్ రెహ్మాన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ మరియు విజువల్ ప్రెజెంటేషన్ కూడా గ్రాండ్ స్థాయిలో ఉండబోతున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఇప్పటికే నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నడుస్తుండగా, ఇప్పుడు జాన్వీ కపూర్ ప్రమోషన్స్ అంశం మరో కొత్త చర్చకు దారి తీసింది. రిలీజ్ సమయానికి ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.










