వైరల్ అవుతున్న ఉమర్ సైంధు పోస్ట్!

  • July 27, 2023 / 12:06 PM IST

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ పై బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ఏ విధంగా ట్విట్స్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే. టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ అంటూ తేడా లేకుండా అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ప్రైవేట్ మ్యాటర్ పై సోషల్ మీడియాలో విచ్చలవిడిగా హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే సూసైడ్ చేసుకోవాలి అని అటెంప్ట్ చేసిందని ..

ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని ఉమర్ సైంధు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్విట్లో ఎలాంటి వాస్తవం లేదు అంటూ పూజ హెగ్డే ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటలకి తాను ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసింది . అయితే ఈ వివాదం అంతటితో ముగిసింది అనుకుంటున్నా క్రమంలో పూజ హెగ్డే పర్సనల్ టీం ఉమర్ సైంధు కి లీగల్ నోటీసులు పంపింది.

అయితే ఆ విషయాన్ని సైతం ఎటువంటి సిగ్గులేకుండా షేర్ చేసుకుంటూ..” నన్ను ఎవ్వడు ఏం పీకలేడు” అనే రేంజ్ లో లోల్ నోట్ అంటూ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పంపిన నోటీస్ ని పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఉమర్ సైంధు పేరు మారుమ్రోగిపోతుంది . అంతేకాదు ఉమర్ సైంధు చేసిన ట్విట్ ప్రకారం చూస్తుంటే “నన్ను ఎవడు ఏం పీకలేడు :అన్న రేంజ్ లోనే ఆయన ఈ పోస్ట్ చేసినట్లు జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అయితే ఉమర్ సైంధు (Pooja Hegde) మాటలకి బాగా కోపం వచ్చినా పూజ హెగ్డే లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటున్నారట. అందుకే కోపంలోనే లీగల్ నోటీసును ఫైల్ చేసి అతగాడికి పంపినట్లు తెలుస్తుంది. దీనితో పూజా హెగ్డే సూసైడ్ చేసుకోబోయ్యింది అన్న ట్వీట్ ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ గా మారింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus