ఆ వార్తల్లో నిజం లేదు :పూజా హెగ్దే

Advertisement

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ … అలాగే మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్ … బిజీగా ఉండే హీరోయిన్.. ఎవరంటే టక్కున చెప్పే పేరు పూజా హెగ్దే. ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బుట్ట బొమ్మ… ఇప్పుడు అఖిల్ కు జోడీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ అనే చిత్రం చేస్తుంది. దాంతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20 వ చిత్రంలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్.

అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ఈ బ్యూటీ చాలా బిజీగా ఉన్న తరుణంలో ఓ తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు చాలా వరకూ ఆ వార్తలు వైరల్ గా కూడా మారిపోయాయి. విషయం ఏమిటంటే… పూజా హెగ్దే… సూర్య సరసన ఆమె ‘అరువా’ సినిమా చేయబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి.

దర్శకుడు హరి ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడని కథనాలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై పూజ హెగ్డే స్పందించింది. “హలో .. హలో మీరు తొందరపడకండి .. నేను ఇంతవరకూ ఏ తమిళ సినిమాకు సైన్ చెయ్యలేదు. కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుండీ ఆఫర్లు వచ్చాయి. అవి ఓకే అయితే నేనే చెబుతాను. ఆ ప్రాజెక్టులు సెట్ అయితే నాకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండడు” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news