జై లవ కుశ టీజర్ చూసి ఎన్టీఆర్ కి కాల్ చేసిన ప్రభాస్
- July 7, 2017 / 11:22 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జై లవకుశ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నఇందులోని ఒక క్యారక్టర్ ని నిన్న రిలీజ్ చేశారు. నెగటివ్ క్యారక్టర్ అయిన జై కి సంబంధించిన టీజర్ లో ఎన్టీఆర్ నటన అదరహో అనిపిస్తోంది. రాఘవేంద్రరావు, రాజమౌళి, కొరటాల శివ వంటి డైరక్టర్లు టీజర్ సూపర్ అంటూ ట్వీట్స్ చేశారు. ఇక సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ జై లవ కుశ టీజర్ చూసిన వెంటనే ఫోన్ చేసి పది నిముషాల సేపు మాట్లాడినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
” కళ్ళల్లో ఆ పవర్ ఏంటి.. ఆ బాడీ ల్యాంగ్వేజ్ ఏంటి? .. నువ్వు సూపర్ డార్లింగ్. యాక్షన్ సీన్స్ చాలా తేలికగా ఎలా చేయగలిగావు?.. నత్తిగా కూడా డైలాగ్ ని అదరగొట్టావు. ఈ సినిమా నీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది” అని ఎన్టీఆర్ కి ప్రభాస్ చెప్పినట్లు సమాచారం. అందుకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పి.. సాహో సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నారంట. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ లో తారక్ సరసన రాశీ ఖన్నా, నివేత థామస్, నందితా రాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















