Prabhas: ప్రశాంత్ నీల్ కోసం మారుతీని పక్కన పెట్టిన ప్రభాస్..!

  • May 11, 2024 / 07:21 PM IST

సినీ పరిశ్రమ అనేది సెంటిమెంట్లతోనే కాదు ఇగోలతో కూడా నిండి ఉంటుంది. బయటివారికి ఇది తెలియకపోవచ్చు. అలా కనపడకపోవచ్చు కూడా..! ఇది మరీ ట్రాక్ తప్పుతుందేమో. స్ట్రైట్ గా పాయింట్ కి వెళ్ళిపోదాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడతను. కలుపుగోలు మనిషి, దగ్గరైతే ఎవ్వరినీ వదులుకోడు. అందుకేనేమో ‘బాహుబలి’లో (Baahubali) ‘అంత మహాబలుడైనా అమ్మ ఒడి పసివాడే’ అంటూ అతనిపై ఓ లైన్ కూడా రాశారు.

సరే ‘దీని వల్ల వచ్చిన సమస్య ఏంటి?’ అని అందరికీ డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా..! ప్రభాస్…. స్థాయితో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. తన వద్ద పనిచేసే దర్శకులని కూడా అంతే..! ప్రభాస్…. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘సలార్’ (Salaar) , మారుతీ (Maruthi Dasari) దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (The Rajasaab)  .. సినిమాలని ఒకేసారి స్టార్ట్ చేశాడు. అయితే ప్రశాంత్ నీల్ ని, మారుతీ..ని అతను ఒకేలా ట్రీట్ చేస్తున్నాడట. నిజంగానే మారుతీ..నీల్ రేంజ్లో సక్సెస్ కొట్టిన దర్శకుడు కాదు.

దీని వల్ల నీల్ ఇగో హర్ట్ అయ్యింది. వాస్తవానికి ఇప్పుడు ప్రభాస్ తన కాల్షీట్స్ అన్నీ ‘రాజా సాబ్’ సినిమాకి ఇవ్వాలి. కానీ ఈ నెల చివర్లో ‘సలార్ 2 ‘ షూటింగ్ ను పునఃప్రారంభించి నవంబర్ కి ఫినిష్ చేయాలని ప్రశాంత్ నీల్ టార్గెట్ పెట్టుకున్నాడట. ఇందుకు ప్రభాస్ ని ప్రత్యేకంగా కలిసి కొన్నాళ్ళు ‘ ‘రాజా సాబ్’ ని పక్కన పెట్టండి’ అని రిక్వెస్ట్ చేసాడట.అంత పెద్ద స్టార్ డైరెక్టర్, పైగా ‘సలార్’ తో కం బ్యాక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్…

అడిగితే ప్రభాస్ కాదంటాడా? ఇందుకు ప్రేక్షకులు సైతం ఏకీభవిస్తారు. అందుకే ‘రాజా సాబ్’ ని కొన్ని రోజులు హోల్డ్ చేయమని ప్రభాస్.. మారుతీకి చెప్పినట్లు సమాచారం. మరి అలా అయితే 2025 సంక్రాంతికి ‘రాజా సాబ్’ రిలీజ్ అవుతుందా? అంటే …! ‘సలార్’ సెకండ్ పార్ట్ షూటింగ్ కొంత కంప్లీట్ అయ్యింది. సో ప్రభాస్ పార్ట్ వరకు షూటింగ్ కంప్లీట్ అయితే.. ‘రాజా సాబ్’ ని ప్రభాస్ ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి.. అలా జరుగుతుందో లేదో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus