పాన్ ఇండియా రేంజ్ లో జాంబీ రెడ్డి 2: ప్రశాంత్ వర్మ

  • February 5, 2021 / 10:00 PM IST

జాంబీ రెడ్డి హడావుడి మొదలైంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా పోటీ ఎక్కువగా ఉండడం వలన వాయిదా వేసుకుంటూ ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చింది. అయితే సినిమాపై బజ్ క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణం దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! , కల్కి వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ ఓ వర్గం ఆడియెన్స్ ను అయితే బాగానే ఎట్రాక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు జాంబీస్ జానర్ ను టచ్ చేయడంతో ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే పెరిగాయి.

ఇక సీక్వెల్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అందులో సమంత నటిస్తుందని కూడా కథనాలు వచ్చాయి. కానీ అది నిజం కాదని దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. నిజానికి సమంత చెప్పింది జాంబీ రెడ్డి సీక్వెల్ కాదట. సమంతకు చెప్పింది మరో కథ అని ప్రస్తుతం నిర్మాత కోసం వేయిట్ చేస్తున్నట్లు ప్రశాంత్ వివరణ ఇచ్చారు. అంతే కాకుండా ప్రశాంత్ వర్మకు జాంబీ రెడ్డిని ఇతర భాషల్లో రీమేక్ చేయాలని ఆఫర్స్ చాలానే వస్తున్నాయట.

ఇది గనక అనుకున్నట్లు. క్లిక్కయితే సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు చెప్పాడు ప్రశాంత్.. అంతే కాకుండా తన దగ్గర మరికొన్ని పాన్ ఇండియా కథలు కూడా ఉన్నట్లు వివరణ ఇచ్చాడు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus