Prashanth Neel: ఆ కథలపై ప్రశాంత్ నీల్ దృష్టి పెడితే బెటర్!

  • May 25, 2022 / 05:22 PM IST

ఉగ్రం, కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను, ఎన్టీఆర్31 సినిమాను డార్క్ షేడ్ లో తెరకెక్కించనుండటంతో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఒకే జానర్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నారని ఇలా చేయడం వల్ల ఆయన కెరీర్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టాలని

ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మైండ్ లో పెట్టుకుని ప్రశాంత్ నీల్ సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని చాలామంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఒకే జానర్ లో సినిమాలను తెరకెక్కిస్తే అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడం కూడా సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎంటర్టైన్మెంట్ కు కొంతమేర ప్రాధాన్యత ఉండే కథలపై ప్రశాంత్ నీల్ దృష్టి పెడితే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వరుసగా సీరియస్ సినిమాలు చేయడం వల్ల ప్రశాంత్ నీల్ సినిమాలకు ఒక వర్గం ప్రేక్షకులు దూరంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కేజీఎఫ్ ఛాప్టర్2 సక్సెస్ తో ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ తో పాటు సినిమాలకు వస్తున్న లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ సినిమా రిలీజ్ కానుంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus