Priyamani: ప్రియమణి ఎదురుచూపులు ఇంతకాలానికి ఫలించాయి..!

  • May 31, 2021 / 08:25 PM IST

‘ఎవరే అతగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రియమణి.. అటు తర్వాత ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ వెంటనే రాజమౌళి… ఎన్టీఆర్ తో తెరకెక్కించిన ‘యమదొంగ’ చిత్రంతో ఈమె స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. కొన్నాళ్ళ వరకూ ఈమె ప్రయాణం ఇక్కడ బాగానే జరిగింది.తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది.అయితే కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు సహజంగానే అవకాశాలు తగ్గాయి. దాంతో ఈమె కన్నడ ..

మలయాళ ఇండస్ట్రీల వైపు మళ్ళింది. అక్కడ కూడా బాగానే రాణించింది. అయితే చాన్నాళ్ళ తర్వాత ఈమె తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈమె వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ సినిమాలో నటిస్తుంది.అలాగే ‘విరాటపర్వం’ సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమె టాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న టైంలో వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురుచూసిందట. ప్రియమణి మాటల్లో.. ” వెంకటేష్ గారితో నటించాలనే కోరిక నాకు చాలా కాలం నుండీ ఉంది.

అప్పట్లో ఆయన సరసన నటించే అవకాశాలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యేవి. ఇంతకాలానికి నా ఎదురుచూపులు ఫలించాయి. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ‘నారప్ప’ లో నేను చేసిన పాత్రకి మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకు ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus