Guntur Kaaram: గుంటూరు కారం కలెక్షన్లపై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

  • January 2, 2024 / 10:51 AM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటించినటువంటి చిత్రం గుంటూరు కారం ఈ సినిమా షూటింగ్ పనులు అన్నింటిని పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వార్తలపై నిర్మాత నాగ వంశీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ వార్తలను పూర్తిగా కొట్టి పారేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగ వంశీ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. నేను ఇలా చెబితే మీరు బలుపు అనుకుంటారేమో కానీ గుంటూరు కారం సినిమా ప్రతి ఏరియాలోను రాజమౌళి సినిమాల కలెక్షన్లకు దగ్గరగా వెళుతుందని ఈయన కామెంట్స్ చేశారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని ఈయన తెలియజేశారు.ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా అభిమానులను ఉద్దేశించి ఒక ట్వీట్ కూడా చేశారు. డియర్ సూపర్ ఫ్యాన్స్, మీకు మళ్ళీ స్ట్రాంగ్ గా చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాము.

గుంటూరు కారంకి రిలీజ్ రికార్డు స్థాయి థియేటర్స్ లో ఉంటుంది. రిలీజ్ బాధ్యత మాకు వదిలేయండి. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ బాధ్యత మాత్రం మీదే అంటూ ఈ సందర్భంగా నాగ వంశీ గుంటూరు కారం సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus