స్టార్ హీరోలు ఖాళీగా లేరు…పూరి జనగణమన ఎవరితో పాడతాడో?
- June 23, 2020 / 04:27 PM ISTByFilmy Focus
దర్శకుడు పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆయన ఈ చిత్రాన్ని త్వరోనే తెరకెక్కిస్తానని చెప్పారు. పాన్ ఇండియా రేంజ్ లో జనగణమన భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. జనగణమన మూవీ ఎప్పటి నుండో పూరికి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంది. కొన్నేళ్ల క్రితం మహేష్ తో ఈ మూవీ చేస్తున్నట్లు పూరి ప్రకటించారు. కారణం ఏదైనా అప్పుడు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.
మళ్ళీ ఇన్నేళ్ల తరువాత పూరి జగన్నాధ్ ఈ ప్రాజెక్ట్ ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో ఆయన ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దాదాపు 50 శాతం ఆ చిత్ర షూటింగ్ ఆయన పూర్తి చేశారు. కాగా ఈ ప్రాజెక్ట్ అనంతరం పూరి జనగణమన మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి ఈ చిత్రంలో ఖచ్చితంగా ఓ స్టార్ హీరో నటించాల్సివుంటుంది. ఐతే టాలీవుడ్ లో ఏ ఒక్క స్టార్ హీరో ఖాళీగా లేరు.

మహేష్ సర్కారు వారి పాట, ఆతరువాత రాజమౌళి సినిమాలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ తరువాత త్రివిక్రమ్ మూవీ చేస్తారు. ప్రభాస్ తన నెక్స్ట్ నాగ్ అశ్విన్ తో కమిట్ అయ్యారు. పవన్, చిరంజీవి బన్నీ కూడా వరుసగా రెండు చిత్రాలు లైన్ లో పెట్టి ఉంచారు. చరణ్ మాత్రమే తన కొత్త మూవీ ప్రకటించలేదు. రెండు మూడేళ్ళ వరకు ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. మరి పూరి ఎవరితో ఈ చిత్రం తీస్తారు అనేది చూడాలి.
Most Recommended Video
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

















