Puri Jagannadh: లైగర్ నష్టాలను భర్తీ చేసిన పూరీ జగన్నాథ్.. కానీ?
September 18, 2022 / 07:29 PM IST
|Follow Us
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఊహించని స్థాయిలో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంలో నష్టపోయారు. సినిమాకు ఏ రేంజ్ లో ఖర్చైందో క్లారిటీ లేకపోయినా సినిమాకు ఊహించని స్థాయిలో నెగిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమాకు అస్సలు కలెక్షన్లు రాలేదు. గురువారం రిలీజ్ చేయడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.
అయితే పూరీ జగన్నాథ్ నష్టాల భర్తీ కోసం 13 కోట్ల రూపాయలు వెనక్కు ఇచ్చారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ డబ్బును పూరీ జగన్నాథ్ సెటిల్ చేశారని తెలుస్తోంది. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు పూరీ జగన్నాథ్ తనకు చేతనైనంత సహాయం చేసి నష్టాల భర్తీ చేశారని బోగట్టా. ఈ విషయంలో పూరీ జగన్నాథ్ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పూరీ జగన్నాథ్ తన తర్వాత సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతో వేగంగానే నష్టాల భర్తీ చేశారని సమాచారం. మరోవైపు పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు రావాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ అడిగితే క్రేజ్ ఉన్న హీరోలలో ఎవరో ఒకరు ఓకే చెప్పే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించాలని చాలామంది హీరోలు ఆశ పడుతున్నారు.
పూరీ జగన్నాథ్ కథ, కథనం విషయంలో మారని పక్షంలో ఆయన ఎన్ని సినిమాలను తెరకెక్కించినా పెద్దగా ఫలితం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ తర్వాత ప్రాజెక్ట్ లకు తనే నిర్మాతగా వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ నిర్మాణ బాధ్యతలకు దూరంగా ఉంటే మంచిదని మరి కొందరు కామెంట్లు చేయడం గమనార్హం.