Pushpa Collections: రూ.150 కోట్లు అవుట్.. వరుసగా రెండోసారి..!

  • January 6, 2022 / 04:29 PM IST

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళనే రాబడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతోంది ‘పుష్ప’..! ఇక ఈ చిత్రం 20 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 36.68 cr
సీడెడ్ 14.20 cr
ఉత్తరాంధ్ర  7.88 cr
ఈస్ట్  4.87 cr
వెస్ట్  4.08 cr
గుంటూరు  5.29 cr
కృష్ణా  4.17 cr
నెల్లూరు  3.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 80.25 cr
తమిళ్ నాడు 10.30 cr
కేరళ   5.05 cr
కర్ణాటక  10.40 cr
రెస్ట్  31.50 cr
ఓవర్సీస్  12.75 cr
టోటల్ వరల్డ్ వైడ్ 150.25 cr

‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.20 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.150.25 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.4.25 కోట్ల లాభాలను అందించింది కానీ ఆంధ్రలో బయ్యర్స్ మాత్రం భారీగా నష్టపోయారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus