Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే ఆ విధంగా తెరకెక్కించగలరా?

  • June 22, 2023 / 07:38 PM IST

ఈ తరం ప్రేక్షకులలో చాలామంది పౌరాణిక సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు మాత్రం చాలా తక్కువమంది ఉన్నారు. శాకుంతలం, ఆదిపురుష్ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. అయితే ఈ సినిమాలలో కథ, కథనం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే రామాయణం, మహాభారతం అద్భుతంగా తెరకెక్కించగలరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి మాత్రమే పౌరాణిక సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాజమౌళి మహాభారతం తెరకెక్కిస్తానని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. రాజమౌళి క్రేజ్ ఊహించని స్థాయిలో ఉండగా జక్కన్నతో సినిమా చేయాలని చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో అయినా నటించాలని బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి వెల్లడించడానికి (Rajamouli) రాజమౌళి ఇష్టపడటం లేదు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండనుందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళిని భాషతో సంబంధం లేకుండా అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. జక్కన్న రాబోయే రోజుల్లో మల్టీస్టారర్లను తెరకెక్కించే దిశగా ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో రాజమౌళి మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus