Rajamouli: మళ్లీ రాజమౌళి రిలీజ్ కు ముందే కథ చెప్పేయనున్నాడా?

Advertisement

దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి తాను ఏ ప్రాజెక్ట్ చేపట్టినా పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగడం ఆయన స్పెషాలిటీ. అసలు ఆయన చేసే పబ్లిసిటీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే అందరు దర్శకులు టీజర్ లు , ట్రైలర్లు మరియు సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి, సినిమాకు బజ్ ని క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తారు. కథ ఏంటి అనేది మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడతారు. కానీ రాజమౌళి మాత్రం డిఫరెంట్ గా , తాను తీయబోయే సినిమాలోని మూల కథను ముందే ఆడియన్స్ కి చెప్పేస్తాడు.

Rajamouli

దాదాపుగా ఇదే పంధాను కొనసాగిస్తూ తన మూవీస్ తో పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు రాజమౌళి. ఎన్టీఆర్ & రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన RRR వంటి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా SSMB 29 ( టైటిల్ ఇంకా ప్రకటించలేదు). ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా , ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు . ఈ చిత్రం లో మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేయగా , MM కీరవాణి మ్యూజిక్ ను అందిస్తున్నారు. K L నారాయణ ప్రొడక్షన్ లో సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 గురించిన లాంచింగ్ ఈవెంట్ ఈ నెల నవంబర్ 15 న జరగనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ లో రాజమౌళి ఎప్పటిలాగే తాను తీయబోయే కథను మొత్తం రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీని కొరకు ఆయన 3 నిమిషాల వీడియో ను కూడా రెడీ చేసినట్లు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దీని గురించి క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.!

ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus