Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

నిన్న ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi) ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రచయితల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు నా కామెడీ టైమింగ్ తగ్గింది. నాకు అనిపించింది ఏంటి? అంటే ఈ రోజుల్లో నా కామెడీ టైమింగ్ ను వాడుకునే రచయితలు లేరు ఇండస్ట్రీలో. గతంలో జంధ్యాల (Jandhyala), తనికెళ్ళ భరణి (Tanikella Bharani), దివాకర్ బాబు (Diwakar Babu), కాశీ విశ్వనాథ్ .. వంటి గొప్ప రచయితలు ఎంతో మంది ఉండేవారు.

Rajendra Prasad

‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమాలో సరైన పంచ్ లైన్స్ లేకపోతే నేను సినిమా చేయను అని చెప్పాను. దీంతో ఆ రచయితలు వచ్చి నన్ను కూర్చోబెట్టి.. ప్రతి పంచ్ లైన్ ను వివరించేవారు. అందువల్లే అవి అంత బాగా వచ్చాయి. ఒక్కసారి రాస్తే చాలు అవి ఓకే అయిపోయాయి. ‘మనిషికి ఎన్ని కాళ్ళు.’ వంటి పంచ్ లైన్స్ ఇప్పుడు ఎవ్వరూ రాసింది లేదు. అయినప్పటికీ ఈ మధ్యన వచ్చిన ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాలో నా కామెడీ టైమింగ్ బాగుంది అని చెప్పారు.

వెన్నెల కిషోర్ కి (Vennela Kishore) నాకు మధ్య వచ్చే సన్నివేశాల్లో కామెడీ బాగా పేలింది. కానీ మేకర్స్ కి ఉపయోగపడకపోవడం బాధాకరం” అంటూ చెప్పుకొచ్చారు. నిజమే.. రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య సీరియస్ రోల్స్ చేస్తున్నారు. ఆయన నుండి ఆశించే కామెడీ తగ్గింది. కాకపోతే రచయితలు లేరు అనడం కూడా కరెక్ట్ కాదు. త్రివిక్రమ్ (Trivikram)  వంటి దిగ్గజ రచయితలు రాజేంద్ర ప్రసాద్ తో కామెడీ బాగానే చేయించారు.

కాకపోతే ఇప్పుడు కామెడీ బుల్లితెరపై జబర్దస్త్ వంటి షోలలో దొరికేస్తుంది. అంతెందుకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా దొరికేస్తుంది. సో రాజేంద్రప్రసాద్ చెప్పిన ‘రెండు కాళ్ళు.. 6 కాళ్ళు’ వంటి పంచ్ లైన్లు ఇప్పుడు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడం లేదు. అలాంటి సన్నివేశాలు ఉంటే.. వెంటనే ‘క్రింజ్’ అనేస్తున్నారు. కామెడీ సీన్స్ రాయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus