అన్ని ఫ్లాప్ లు పడినా.. అంత ఎలా ఇస్తున్నారబ్బా?

  • July 8, 2020 / 07:30 AM IST

ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మాత్రమే అత్యధిక పారితోషికాలు అందుకుంటారనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు.. సౌత్ లో ఉన్న స్టార్ హీరోలు కూడా కళ్ళు తిరిగే రేంజ్లో పారితోషికాలు అందుకుంటున్నారు. అయితే సౌత్ లో మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోలను కలుపుకున్నా ఎక్కువ పారితోషికం తీసుకునే హీరో సూపర్ స్టార్ రజినీ కాంత్ అనే చెప్పాలి. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన శివ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘అన్నాతె’ చిత్రం కోసం ఏకంగా 100 కోట్లు పారితోషికం అందుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదల అవుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్ధితిలో అది అసాధ్యమనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం పూర్తయిన తరువాత ‘ఖైదీ’ ‘మాష్టర్’ ల దర్శకుడు లోకేష్ కనగరాజన్ తో కూడా ఓ చిత్రం చెయ్యడానికి ఓకే చెప్పాడు రజినీ. ఈ చిత్రాన్ని యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా రజినీ .. భారీగా 100 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడట.

ఈ మధ్య కాలంలో రజినీ నటించిన సినిమాలు హిట్టయినవి లేవు. ‘పేట’ ‘దర్బార్’ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక ‘2.0’ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చినప్పటికీ.. కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రజినీకి అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఎలా ఇస్తున్నారు?అనేది పెద్ద ప్రశ్న.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus