Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్.. కూతురితో కలసి…
- August 24, 2026 / 06:39 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ తన ఆత్మకథ రాస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితంలోని కీలక అంశాలను ఆయన తన పుస్తకంలో రాస్తున్నారని ఆ వార్తల సారాంశం. ఈ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కూడా ఈ పుస్తక రచనలో భాగస్వామిని అని చెప్పారు.
Rajinikanth
రజనీకాంత్ వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, కోలీవుడ్లో అగ్రస్థానానికి చేరుకునేందుకు ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలన్నీ ఈ ఆత్మకథలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను పుస్తకంగా మాత్రమే కాకుండా, సినిమాగా (బయోపిక్) కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని సౌందర్య దగ్గర ప్రస్తావిస్తే.. అవును మా నాన్న తన ఆత్మకథ రాస్తున్నారు. నేను కూడా ఇందులో భాగమయయాను. ఆ పుస్తకం ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను అని చెప్పారు.
ఆ ఆత్మకథ సిద్ధమవుతున్న విధానం చూస్తుంటే.. ఇదొక అరుదైన రచనగా మిగిలిపోతుంది అని చెప్పగలను. పదే పదే చదివేలా ఆ ఆత్మకథ ఉండబోతోంది అని ఆమె చెప్పారు. పరమహంస యోగేంద్ర ఆత్మకథ లాంటిది నాన్న ఆత్మకథ అని కూడా చెప్పారామె. అలాగే ఈ పుస్తకాన్ని సినిమాగా చేస్తే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాం అని చెప్పారామె. అన్నట్లు రజనీకాంత్ జీవితంలో ప్రేక్షకుల కోణంలో కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. అవి ఈ పుస్తకంతో బయటకు వస్తాయేమో చూడాలి.
ఇక రజనీకాంత్ సినిమాల సంగతి చూస్తే.. ఆయన ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఇక అశ్వత్ మరిముత్తు డైరక్షన్లో కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘ధర్మన్’ షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలింసీటీలో ఈ రోజు నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది. ఇందులో హీరో రామ్ పోతినేని కూడా పాల్గొంటాడని టాక్. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబో పనులు మొదలవుతాయి..














