Rakul Preet: ఈడీకి రకుల్ స్పెషల్ రిక్వెస్ట్!

  • September 2, 2021 / 06:26 PM IST

టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు విచారణకు కొంత సమయం కావాలని నటి రకుల్ ప్రీత్ సింగ్ కోరారు. కేసు విచారణలో భాగంగా ఈ నెల 6న ఆమె ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్) ఎదుట హాజరు కావాల్సివుంది. అయితే వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉండడంతో తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత గడువు ఇవ్వాలని ఆమె ఈడీని కోరారు. దీంతో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈడీ విచారణకు రకుల్ హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొంది.

దాదాపు నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులను అధికారులు విచారించారు. అయితే ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసుని టేకప్ చేసిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 31న దర్శకుడు పూరి జగన్నాథ్,

సెప్టెంబర్ 2న ఛార్మి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇక సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22వ తేదీన తరుణ్ ఈడీ ఎదుట హాజరు కావాల్సివుంది!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus