ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా కోసం విలన్ గా స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా?

  • May 6, 2020 / 05:42 PM IST

ఇప్పుడు తన 20 వ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ వరల్డ్ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 400 కోట్లు బడ్జెట్ ను కేటాయిస్తున్నారట నిర్మాత అశ్వినీ దత్. అంటే ‘ఆర్.ఆర్.ఆర్’ కు మించి అన్నమాట. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని… ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న హీరోగా కనిపిస్తాడని తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కు సంబందించి పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందట. చాలా బాగా వచ్చిందని… హీరో ప్రభాస్ అలాగే నిర్మాత అశ్వినీ దత్ చెప్పారట. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టెయ్యాలి అని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఎలాగూ లాక్ డౌన్ కాబట్టి… ఇప్పుడు షూటింగ్ లు కూడా ఏమీ లేవు కాబట్టి… సెలబ్రిటీలు అందరూ ఇళ్ళలోనే ఉంటున్నారు. ఇప్పుడైతేనే అందరి కాల్షీట్స్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో విలన్ గా అరవింద్ స్వామి ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ మధ్యే అరవింద్ స్వామి కి వీడియో కాల్ ద్వారా కథ వినిపించాడట దర్శకుడు నాగ్ అశ్విన్. అందుకు అరవింద స్వామి కూడా సానుకూలంగా స్పందించాడట. దాదాపు ఈయన ఖరారు అయినట్టే అని తెలుస్తుంది. గతంలో రాంచరణ్ – సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ధృవ’ చిత్రంలో కూడా అరవింద్ స్వామి స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus