మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన..!

  • November 26, 2020 / 11:42 AM IST

ప్రస్తుతం జూనియర్ సమంత అనే రేంజ్లో దూసుకుపోతుంది రష్మిక మందన. గతంలో సమంత కూడా సైలెంట్ గా వచ్చి హిట్లు మీద హిట్లు కొట్టి గోల్డెన్ లెగ్ గా చలామణి అయ్యింది. ఆమె తరువాత ఆ దిశగా దూసుకుపోతుంది రష్మిక అనే చెప్పాలి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో నటించడం.. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఆ వెంటనే అల్లు అర్జున్, కార్తీ, ఇప్పుడు సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యనే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి రష్మిక ను సంప్రదించారట దర్శకనిర్మాతలు. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లోనే ఎన్టీఆర్ ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇదిలా ఉండగా..

ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికను ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. మొదట పూజా హెగ్డే,కీర్తి సురేష్, కియారా అద్వానీ.. వంటి వారిని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న క్రేజ్ ను బట్టి రష్మిక మందన అయితేనే కరెక్ట్ అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఆల్రెడీ ఈ బ్యానర్లో రష్మిక ‘భీష్మ’ చిత్రం చేసింది. అది కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus