Rashmika: సెలబ్రిటీ అయితే నచ్చాలని రూల్ లేదు… ట్రోల్స్ పై రష్మిక కామెంట్స్!

  • January 7, 2023 / 06:58 PM IST

చలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన. రష్మిక తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ఇలా తెలుగులో రష్మిక నటించిన సినిమాలు వరుసగా హిట్ అవటంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇక తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం విజయ్ దళపతి సరసన నటించిన వారసుడు సినిమా తెలుగు, తమిళ్ భాషలలో విడుదల కానుంది. ఇక బాలీవుడ్ లో ప్రధాన పాత్రలో రష్మిక నటించిన ‘ మిషన్ మజ్ను ‘ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రష్మిక ఇటీవల కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ… కాంతార సినిమా విడుదలైన సమయంలో జరిగిన వివాదం గురించి మరొకసారి స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ…” నటి అన్న తర్వాత అందరూ ఇష్టపడాలని లేదు. ఇండస్ట్రీలో కొందరికి మనం అంటే దేశం ఉండొచ్చు మరికొందరికి ప్రేమ కూడా ఉండొచ్చు. నేను ఒక పబ్లిక్ సెలబ్రిటీ. అందువల్ల పబ్లిక్ తోనే ఉండాలి, వారితోనే మాట్లాడాలి. ఈ క్రమంలో కొందరికి నా పేరు నచ్చకపోవచ్చు.

నేను మాట్లాడే మాటలు, నా ఎక్స్ప్రెషన్స్ కూడా నచ్చకపోవచ్చు. నేను నచ్చకపోవటానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ నామీద ప్రేమ చూపించే వారికి మాత్రం నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని” అంటూ రిషబ్ శెట్టి తనమీద చేసిన విమర్శల గురించి స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus