జనవరి 26న రవితేజ, వి ఐ ఆనంద్ టైటిల్ లోగో లాంఛ్
- January 24, 2019 / 10:59 AM ISTByFilmy Focus
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నూతన చిత్రం మొదలుపెట్టబోతున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. జనవరి 26న రిపబ్లిక్ డే, రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ లోగోని లాంఛ్ చేయనున్నారు. రవితేజకు జోడిగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














