అసలు విషయం అదైనప్పుడు వంశీ చేతిలో ఏముంది..!

  • March 2, 2020 / 06:56 AM IST

మే లో మొదలుకావాల్సిన మహేష్ -వంశీ పైడిపల్లి మూవీ హోల్డ్ లో పడింది. మహేష్ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తికరంగా లేని కారణంగా సినిమా హోల్డ్ లో పెట్టాడంటూ వార్తలు వినిపించాయి. ఐతే అసలు విషయం అది కాదని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న టాక్. మహేష్ అడిగిన రెమ్యూనరేషన్ కి నిర్మాత దిల్ రాజు ఒప్పుకోక పోవడమే కారణం అని సమాచారం. మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీ భారీ విజయం సాధించడంతో పాటు, 100కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

దీనితో మహేష్ తన రెమ్యూనరేషన్ కింద భారీ అమౌంట్ అడుగుతున్నారట. దిల్ రాజు మహేష్ అడిగిన మొత్తానికి అంగీకరించకపోవడంతో మహేష్ ప్రాజెక్ట్ ఆపేశారట. ఇందులో నిజం ఉంది అనిపిస్తుంది. దానికి కారణం స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాకే మహేష్ వంశీ మూవీకి ఒకే చెప్పడం జరిగింది. మహేష్ వెకేషన్ కి వెళ్లే ముందు వరకు కూడా వంశీ మూవీ ఆగిపోతుందన్న సమాచారం లేదు. ఈ కొద్దిరోజులలోనే ఏదో జరిగింది. మరి అసలు విషయం పైకం అయినప్పుడు వంశీ ఎంత గొప్ప స్క్రిప్ట్ రెడీ చేస్తే మాత్రం ఏమీ ప్రయోజనం. నిద్ర పోతున్న వాణ్ణి లేపవచ్చు.. కానీ నటిస్తున్నవాణ్ణి కాదు. ఇప్పుడు వంశీ పరిస్థితి అలానే తయారైంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus