హైదరాబాద్ లో మొదలుకానున్న సాహో

  • January 9, 2018 / 08:15 AM IST

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రభాస్ లాస్ ఏంజిల్స్ కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. సుజీత్ మాత్రం హైదరాబాద్ లో సాహో కోసం అద్భుతమైన సెట్ ని రెడీ చేశారు. విదేశాల నుంచి నిన్న ప్రభాస్ నగరానికి చేరుకున్నారు. రేపటి నుంచి మొదలయ్యే షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా పాల్గొననుంది. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం సాహో టీమ్ మొత్తం దుబాయ్ వెళ్లనుంది.

దుబాయ్ శివార్లలో 45 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. అక్కడ కొండల నడుమ పెద్ద యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు. మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ని ఆధ్వర్యంలో ఈ ఫైట్ తెరకెక్కించనున్నారు. ముప్పై కోట్లు ఖర్చు చేయనున్న ఈ ఫైట్ సినిమాలోనే హైలెట్ కానుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సాహోకి సంగీతాన్ని అందిస్తున్నారు. నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, టిన్ను ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus