భారీ యాక్షన్ సీన్ కోసం సిద్ధమవుతున్న సాహో టీమ్

  • December 11, 2017 / 01:36 PM IST

ప్రభాస్ అంటే యాక్షన్ సీన్స్ ఉండాల్సిందే. బాహుబలి తర్వాత అతని సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టు సుజీత్ ప్లాన్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఒక స్టయిల్లో యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసిన డైరెక్టర్.. రీసెంట్ గా దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా టవర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఒక యాక్షన్ సీన్ తో పాటు ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధ కపూర్ పై ఒక పాటను పూర్తి చేశారు. జనవరి నుంచి మొదలుకానున్న షెడ్యూల్ ల్లో బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయబోతున్నారు.

సాహో సినిమాలో ఈ యాక్షన్ పార్ట్ ఏకంగా 20 నిమిషాల పాటు ఉండబోతోంది. ఇది సినిమాలో ఓ హైలెట్ కానుంది. ఈ 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా నెల రోజుల షెడ్యూల్ ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 200 కోట్లతో ఈ చిత్రాన్ని వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే , తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్” తదితరులు నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus