Sai Dharam Tej: ట్రైలర్ నన్ను ఎంతగానో కదిలించింది: సాయిధరమ్ తేజ్

  • May 18, 2022 / 02:24 PM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కారణంగా గత కొంత కాలం నుంచి ఇంటికే పరిమితమై పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో తిరిగి సినిమాలపై దృష్టి సారించారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల గురించి సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేయడం సినిమాలపై అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇదివరకే విడుదలైన సర్కారు వారి పాట అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలపై సాయిధరమ్ స్పందిస్తూ పోస్టులు చేశారు.

తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా హీరో రానాకు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంతువులతో మనుషులకు ఉండే ఎమోషన్స్ తెలియజేస్తూ కిరణ్ రాజ్ దర్శకత్వంలో 777 చార్లీ అనే సినిమా ద్వారా రక్షిత్ శెట్టి కుక్కను స్పెషల్ గా చూపించబోతున్నారు.

ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రతి ఒక్క లవర్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ పై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ హీరో రానాకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. నా హృదయం బరువెక్కింది… ఈ ట్రైలర్ నన్ను ఎంతగానో కదిలించింది.

సోదరా రక్షిత్ శెట్టి నీపై నాకు మరింత గౌరవం పెరిగింది. ఈ సినిమాని తెలుగులో మనకు అందిస్తున్న హీరో రానాకు థాంక్స్ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేయడంతో సాయిధరమ్ తేజ్ రానాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇక ఈ సినిమా అన్ని భాషలలో జూన్ 10వ తేదీ విడుదల కానుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus