తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

గల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ వీరుడు కర్నల్ సంతోష్ బాబు కథను ఇప్పుడు బాలీవుడ్ తెరపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020లో చైనా సైన్యాన్ని ఎదుర్కొని గర్వకారణంగా నిలిచిన ఆయన, భారతీయ జవాన్లలో అసాధారణ నాయకత్వం ప్రదర్శించి వీర మరణం పొందారు. ఇప్పుడు ఆయన జీవితాన్ని ఓ స్ఫూర్తిదాయకమైన బయోపిక్‌గా తెరకెక్కించేందుకు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకొస్తోంది. ఈ సినిమాలో కర్నల్ సంతోష్ బాబు పాత్రను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పోషించబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.

Salman Khan

ఈ బయోపిక్ కోసం ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3’ అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని స్క్రిప్ట్ పనులు పూర్తవుతున్నాయి. రచయితలు శివ్ అరూర్, రాహుల్ సింగ్‌లు రచించిన ఈ పుస్తకంలోని కథని సినిమాకి అనుగుణంగా మార్చుతున్నారు. సురేష్ నాయర్, చింతన్ గాంధీ, చింతన్ షా కలిసి స్క్రీన్‌ప్లే పని చేపట్టగా, అపూర్వా లాఖియా దర్శకత్వ బాధ్యతను చేపట్టనున్నారు. జులైలో షూటింగ్ ప్రారంభించి కేవలం 70 రోజులలో షూట్ పూర్తి చేయాలన్నది చిత్రబృంద లక్ష్యం.

ఈ సినిమాలో భాగంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఆర్మీ మ్యాన్ పాత్రలో నటించడం ఆయనకు ఇది కొత్త కాదు. గతంలో ‘హీరోస్’, ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ లాంటి చిత్రాల్లో మిలిటరీ లేదా స్పై పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న ఆయనకు ఇది మరొక భావోద్వేగ పాత్ర అవుతుందన్న నమ్మకం ఉంది. సంతోష్ బాబు పాత్రను న్యాయంగా నెరవేర్చేందుకు సల్మాన్ తగిన శిక్షణలు కూడా తీసుకుంటున్నారట.

కుటుంబ సభ్యుల మాటల ప్రకారం, తమ బిడ్డ జీవితాన్ని ప్రపంచానికి చూపించాలన్న ఉద్దేశంతో సినిమా రూపొందుతున్నదంటే గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా సూర్యాపేటకు చెందిన వీరుడు కథను దేశమంతా చూసేలా చేయడం తమకెంతో ఆనందం కలిగించిందన్నారు. కర్నల్ సంతోష్ బాబు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఈ బయోపిక్ ద్వారా అర్థవంతంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు బాలీవుడ్ ప్రయత్నం చేస్తున్నదంటే, అది సినీ ప్రపంచానికి ఒక గౌరవ కృషిగా చెప్పాలి.

బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus