Samantha: సద్గురు ఇషా సెంటర్ లో జాయిన్ అయినా సమంత… ఆరోగ్యం పై పూర్తి దృష్టి!

  • July 20, 2023 / 03:02 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. ఈమె గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడటం కోసం సినిమాలకు విరామం ప్రకటించి పూర్తిగా తన ఆరోగ్యం పైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఈమె చికిత్స కోసం అమెరికా కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇలా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆధ్యాత్మిక చింతనలో కూడా గడుపుతున్నారు.

ఇకపోతే సినిమాలకు విరామం ప్రకటించినటువంటి సమంత సద్గురు ఇషా ఆశ్రమంలో చేరినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆశ్రమంలో పూర్తి ధ్యానంలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి సమంత..కొంతసేపటి వరకు ఎలాంటి ఆలోచనలు డిస్టర్బెన్స్ కుదుపులు లేకుండా ఉండడం అంటే చాలా కష్టం అనిపించింది.

అయితే ఈరోజు ధ్యానస్థితి నాలో శక్తికి అత్యంత శక్తివంతమైన మూలంగా ప్రశాంతంగా మారిందని ఈ ప్రక్రియ ఇలా సింపుల్గా శక్తివంతంగా ఉంటుందని తాను అనుకోలేదు అంటూ ఈ ఫోటోలను షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు. ఇలా సమంత మెడిటేషన్ చేస్తూ ఉన్నటువంటి ఈ ఫోటోలో వైరల్ గా మారాయి.

ఇక ఈమె (Samantha) సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత నటించిన ఖుషి, సిటాడెల్ ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ రెండు విడుదల కానున్నాయి. ఇక సమంత మాత్రం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా ఏడాది మొత్తం సినిమాలకు విరామం ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus