Samantha: బాలీవుడ్ మీడియాకి అడ్డంగా దొరికిపోయిన సమంత..!

  • January 17, 2022 / 07:46 PM IST

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంతకి రెక్కలు వచ్చినట్టు అయ్యింది. స్వేచ్ఛగా ఓ పక్షిలా తనకి నచ్చినట్టు విహరిస్తోంది. ఒకప్పుడు అంటే అక్కినేని వారి ఇంటి పెద్ద కోడలు కాబట్టి… బోలెడన్ని షరతులు ఉండేవి. ఇప్పుడు అవేవి లేవు… బికినీ ఫోటోలు, ఐటెం సాంగ్ లు, ఇంటిమేట్ సన్నివేశాలు.. ఇలా సినిమాల్లో ఏది కావాలంటే అది చేయొచ్చు. అందుకే ‘పుష్ప’ సినిమాలో ఏకంగా ‘ఉ అంటావా మావ ఉఊ అంటావా’ అంటూ ఓ ఐటెం సాంగ్ లో చిందులు వేసింది.

ఇండైరెక్ట్ గా చైతన్య పై అలాగే మగాళ్ళ పై సెటైర్లు వేసినట్టు ఆ పాట ఉంటుంది కాబట్టి.. సమంత హ్యాపీ. మరో పక్క నిర్మాతల వద్ద నుండీ కూడా ఆ పాట కోసం రూ.1 కోటి 50 లక్షలు బాదింది. నిజానికి సమంత పారితోషికం ఒక్క సినిమాకి వచ్చి రూ.2 కోట్లు లోపే ఉంటుంది. కానీ ‘పుష్ప’ లో ఓ పాట కోసమే అంత పెద్ద మొత్తం అందుకుంది. తెలుగులో సమంతకి అది పెద్ద లెక్కే..!

కానీ బాలీవుడ్ మార్కెట్ కి, అక్కడి మేకర్స్ కు అది పెద్ద అమౌంట్ కాదు. అందుకోసం ‘పుష్ప’ ఐటెం సాంగ్ కు ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు అక్కడి మేకర్స్ కు తెలిపిందట.ఆ నెంబర్ చెప్పి అక్కడి మేకర్స్ నుండీ ఇంకా ఎక్కువ బాదొచ్చు అనేది సమంత ప్లాన్. అయితే ఆ మేకర్స్ కాస్త మన ‘పుష్ప’ నిర్మాతల్ని సంప్రదిస్తే ‘అబ్బే లేదు ఆమెకి కోటిన్నరే ఇచ్చాము’ అని డైరెక్ట్ గా చెప్పేశారట.

అంతే సమంత బండారం బయటపడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ మీడియా సమంత పై సెటైర్లు వేస్తుంది. అనవసరంగా బిల్డప్ కి పోయి నవ్వులపాలైంది సమంత.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus