Directors: హిట్లు కొట్టి కూడా ఖాళీగా కూర్చున్నారు.. కానీ..!

  • March 28, 2023 / 12:06 AM IST

2023 సంక్రాంతికి నువ్వా నేనా అంటూ తలబడ్డారు దర్శకులు (Directors) గోపీచంద్ మలినేని మరియు బాబీ. ‘వీరసింహారెడ్డి’ తో గోపీచంద్ మలినేని, ‘వాల్తేరు వీరయ్య’ తో బాబీ బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఇద్దరూ కూడా తమ అభిమాన హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇద్దరూ కూడా ఖాళీగా కూర్చున్నారు. ఈ ఇద్దరు దర్శకులు కూడా హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. బాబీ వెళ్లి బాలయ్యకి కథ చెప్పాడు.

కానీ బాలయ్య రెండు ప్రాజెక్టులకు కమిట్ అయిపోయాడు. ఒకటి అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తుండగా.. తర్వాత బోయపాటి శ్రీనుతో చేయాల్సి ఉంది. మరోపక్క గోపీచంద్ మలినేని కూడా వెళ్లి చిరుకి కథ చెప్పాడు. రెస్పాన్స్ ఇంకా రాలేదు. ప్రస్తుతం ఆయన ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. తర్వాతి సినిమాని కూతురి నిర్మాణంలో చేయాలనుకుంటున్నారు. బి.వి.ఎస్ రవి చెప్పిన కథ లాక్ చేశారు. డైరెక్టర్ కుదర్లేదు. వర్కౌట్ అయితే గోపీచంద్ మలినేని ఆ ప్రాజెక్టుని డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.

మరోపక్క బాబీ అయితే రవితేజ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ రవితేజ ముగ్గురు డైరెక్టర్లకు కమిట్ అయిపోయాడు. మరోపక్క అతను చిన్న సినిమా ఈవెంట్ లకు కూడా హాజరవుతున్నాడు. ఈ గ్యాప్ లో అతను హీరో గోపీచంద్ కు ఓ కథ చెప్పాడట. ఇది మల్టీస్టారర్ కథ అని తెలుస్తుంది. గోపీచంద్ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడని టాక్. ఈ కథకి మరో హీరో కూడా ఓకే చెబితే .. సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. లేదంటే లేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus