సావిత్రి గురించి నిజాలను చెప్పిన కూతురు
- April 26, 2017 / 10:42 AM ISTByFilmy Focus
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవితంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండేళ్లుగా ఆమె గురించి పరిశోధించి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటించనుంది. క్యూట్ బ్యూటీ సమంత జర్నలిస్ట్ గా కనిపించనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో సావిత్రి గురించి కొన్ని విషయాలను ఆమె కూతురు విజయ చాముండేశ్వరి గుర్తుచేసుకున్నారు. “అమ్మ (సావిత్రి) మంచితనం .. అమాయకత్వమే ఆమె ఎక్కువగా ఆవేదన చెందడానికి కారణమయ్యాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు నాన్న(శివాజీ గణేశన్) ఆమె దగ్గరే ఉండేవారు.” అని మీడియాకి చెప్పారు.
ఇంకా సావిత్రి చివరి సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. “అమ్మ తుది శ్వాస తీసుకునే వరకు మెరుగైన వైద్యాన్ని అందించాము. ఇప్పటికైనా ఆమె చివరి రోజుల్లో ఆర్ధిక కష్టాలు పడ్డారని ప్రచారం చేయవద్దు” అని విన్నవించారు. ఈ రోజున తామంతా ఈ స్థాయిలో జీవితాన్ని గడుపుతుండటం ఆమె చలవేనని చెప్పుకొచ్చారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












