Sharwanand: సిద్ధార్థ్-అదితీ రావు హైదరీ రిలేషన్ పై శర్వానంద్ కామెంట్స్!

  • November 5, 2022 / 12:37 AM IST

కొంతకాలంగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావు హైదరి ల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ముంబైలో సెలూన్ వద్ద కలిసున్నప్పుడు ఈ జంట మీడియా కంట పడింది. తర్వాత అదితి పుట్టినరోజు సందర్భంగా ‘నా హృదయపూర్వక యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ పోస్ట్ పెట్టి వీళ్ళు కలిసున్న ఓ ఫోటోని షేర్ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి ‘మహాసముద్రం’ అనే చిత్రంలో నటించారు. ఇందులో వీరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయి.

పనిలో పనిగా వీళ్లిద్దరి మధ్య ఓ ఇంటిమేట్ సన్నివేశాన్ని కూడా పెట్టాడు దర్శకుడు అజయ్ భూపతి.దీంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నిజమే అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వీరి రిలేషన్ పై ‘మహాసముద్రం’ హీరో అయిన శర్వానంద్ స్పందించాడు. ఇటీవల అతను అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బీకే సెకండ్ సీజన్ నాలుగో ఎపిసోడ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో మీ సినిమాలో ‘హీరోయిన్లను ఎలా ఎంచుకుంటారు?’ అంటూ శర్వానంద్ ను బాలకృష్ణ ప్రశ్నించారు.

అందుకు శర్వానంద్ ‘నాదేమీ లేదు.. నా దర్శకులు ఎలా చెబితే అలా చేయడం తప్ప నేను స్పెషల్ గా ఏమి సెలెక్ట్ చేసుకోవడం ఏమీ ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి అదితి రావు హైదరి సంగతేంటి? అని బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ‘ఆవిడ ‘మహాసముద్రం’ లో నాకు జంటగా నటించలేదు.సిద్ధార్థ్ కు జంటగా నటించింది’ అంటూ శర్వానంద్ బదులిచ్చాడు. దానికి బాలయ్య ‘రియల్ లైఫ్ లో కూడా ఆమె సిద్దార్థ్ కు జంటగా మారిందా?’ అంటూ మళ్ళీ శర్వాని ప్రశ్నించాడు.

దీనికి శర్వా.. ముందు నాకు తెలీదు అని చెప్పి ‘ఇంస్టాగ్రామ్ లో తన హృదయపూర్వక యువరాణి కామెంట్ చేశారని, అందువల్ల నేను ఇలా మాట్లాడుతున్నానని’ శర్వానంద్ చెప్పుకొచ్చారు. ‘అంటే పలికిందంటావా’ అంటూ బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ‘ఏమో పలికిందేమో’ అంటూ చెప్పాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus