‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ కు ఎంత పెడుతున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

  • November 12, 2020 / 09:27 PM IST

ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. ‘జిల్’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అందించిన రాధా కృష్ణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే 40శాతం పూర్తయ్యింది. ఈ మధ్యనే ఇటలీ షెడ్యూల్ ను కూడా ఫినిష్ చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని ఫినిష్ చెయ్యాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతోన్న…

ఈ చిత్రంలో యాక్షన్ అంశాలు చాలా తక్కువగా ఉంటాయట.అయితే గ్రాఫిక్స్ వర్క్ మాత్రం ఎక్కువ ఉంటుందని సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. అందుకే క్లైమాక్స్ ను చిత్రీకరించే విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు గాను ఏకంగా రూ.30కోట్ల వరకూ వారు ఖర్చు చెయ్యబోతున్నట్టు సమాచారం. ఒక్క క్లైమాక్స్ కే అంత పెడుతుంటే.. సినిమా మొత్తానికి ఎంత ఖర్చవుతుంది అనే అనుమానం అందరిలోనూ మొదలైంది.

మొదట ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని రూ.140 కోట్ల బడ్జెట్లో రూపొందించాలి అనుకున్నారు. కానీ ఇప్పటి లెక్కలను బట్టి చూస్తుంటే.. ఈ చిత్రానికి రూ.190కోట్ల నుండీ రూ.220కోట్లు అయ్యే అవకాశం ఉందట. ప్రభాస్ గత చిత్రం ‘సాహో’ ను 350కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. అన్ని భాషల్లోనూ కలిపి ఆ చిత్రం రూ.230 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. కాబట్టి ప్రభాస్ ను నమ్మి రూ.220కోట్లు పెట్టడం పెద్ద రిస్క్ కాదని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus