Gunasekhar: ఆయన వార్నింగ్ వల్లే రుద్రమదేవి మూవీ రిలీజైందా?

  • June 30, 2022 / 11:28 AM IST

గుణశేఖర్ డైరెక్షన్ లో అనుష్క, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రుద్రమదేవి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. 2015 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించగా నిర్మాతగా ఆయనకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదే శాకుంతలం రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే కొండా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ రుద్రమదేవి సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాకు గ్రాఫిక్స్ చాలా కీలకమని గుణశేఖర్ ఆ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను ముంబైలోని కంపెనీకి అప్పగించారని తెలిపారు. ఆ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించి అగ్రిమెంట్స్ కూడా జరిగాయని అయితే సినిమా కంటెంట్ కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు ఎంతకాలమైనా ముందుకు వెళ్లలేదని

అప్పటికే రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో గుణశేఖర్ టెన్షన్ పడ్డారని కొండా సురేఖ అన్నారు. ఆ సమయంలో గుణశేఖర్ మమ్మల్ని కలిసి సమస్యను చెప్పుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కొండా మురళి ముంబైకు వెళ్లి గ్రాఫిక్స్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చారని ఆమె తెలిపారు. మురళి వార్నింగ్ ఇచ్చిన వారం రోజులకు ఆ కంపెనీ కంటెంట్ ఇచ్చిందని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.

గుణశేఖర్ ఫ్యామిలీతో అప్పటినుంచి మంచి అనుబంధం ఉందని కొండా సురేఖ పేర్కొన్నారు. మరోవైపు శాకుంతలం సినిమా కూడా గ్రాఫిక్స్ పనుల వల్లే ఆలస్యం అవుతోందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus