Bhairava Dweepam: ‘భైరవద్వీపం’ మూవీ సెన్సార్ టైములో అంత జరిగిందా..!

  • February 10, 2022 / 11:36 AM IST

‘ఆదిత్య 369’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు- బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘భైరవ ద్వీపం’. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు పలు విభాగాల్లో ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం.ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించగా బి. వెంకట్రామరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Click Here To Watch

రావి కొండలరావు అందించిన కథ, మాటలు, మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. టెక్నికల్ గా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా ఈ మూవీని విజువల్ వండర్ గా మలిచారు సింగీతం గారు. ఇప్పటి హీరోలు కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ సింగీతం వంటి దర్శకుడు లేకపోవడంతో హీరోలు ముందడుగు వేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ‘భైరవద్వీపం’ సినిమా సెన్సార్ టైములో చిత్ర బృందానికి ఓ వింత అనుభవం ఎదురైందట.

అదేమంటే ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా చేయకుండా సెన్సార్ కార్యక్రమాలు జరిగాయట. అయినప్పటికీ సెన్సార్ వాళ్ళు ఓ విషయమై చిత్ర బృందానికి వార్ణింగ్ ఇచ్చారట. ‘మా వరకు మీ చిత్రానికి అభ్యంతరం చెప్పడం లేదు. కానీ బాణాలకి గుర్రాలు పడిపోయిన షాట్స్ కొన్ని ఉన్నాయి. వన్య ప్రాణి సంరక్షణ సంఘం వాళ్ళు వాటికి అభ్యంతరం తెలపొచ్చు. అలా జరిగితే ఆ సన్నివేశాలను తొలగించమంటారు’ అంటూ వార్ణింగ్ ఇచ్చారట.

కానీ సినిమా విడుదలయ్యాక వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడం విశేషం. మనం ఇప్పుడు చూసే సినిమాలకి జంతువులకి, పశువులకి ఎటువంటి హాని కలుగలేదు అని స్టార్టింగ్ లో వేయడానికి ముఖ్య కారణం ఇదే..!

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus