Shruti Haasan: ”టికెట్ రేట్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడలేను”: శృతిహాసన్

  • December 9, 2021 / 10:54 PM IST

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ ఇష్యూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై ఇండస్ట్రీకి చెందిన హీరోలు దర్శకులు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ శృతిహాసన్ ను ప్రశ్నించింది మీడియా. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంపై స్పందించమని కోరింది. ఆ ప్రశ్న తనను ఎందుకు అడుగుతున్నారని రివర్స్ లో ప్రశ్నించింది శృతిహాసన్. ”నిజాయితీగా చెబుతున్నాను. నేను ప్రొడ్యూసర్ ని కాదు.. కనీసం డిస్ట్రిబ్యూటర్ ను కూడా కాదు.

కాబట్టి ఈ విషయంపై ఏదో ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం చెప్పగలను. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో మనమంతా శక్తిమేరకు పని చేస్తున్నాం. కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది. దీంతో మన పోరాటం మరింత పెరిగింది. థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.. ఇలా అందరూ తమ పరిధిలో తమకు చేతనైనంత చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. తన సినిమాల గురించి మాట్లాడుతూ.. సౌత్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది శృతి.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం మరో ఒరిజినల్ సినిమా చేయబోతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పే ప్లాన్ లో ఉంది శృతిహాసన్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus