మరో సంగీత సంచలనాన్ని పరిచయం చేయనున్న మణిరత్నం
- July 11, 2019 / 01:43 PM ISTByFilmy Focus
సింగర్స్ గా కెరీర్ మొదలెట్టి సంగీత దర్శకులుగా మారినవాళ్లు ఎందరో. ఆ లిస్ట్ లో జాయిన్ అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు మోస్ట్ సెన్సేషనల్ సింగర్ సీడ్ శ్రీరామ్. “మాటే వినదుగా, ఇంకేం ఇంకేం కావాలి, మెల్లమెల్లగా” వంటి పాటలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న సీడ్ శ్రీరామ్ త్వరలోనే.. మణిరత్నం నిర్మించనున్న “వానం కొట్టటుం” అనే సినిమా ద్వారా సీడ్ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాజేష్ జంటగా తమిళంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. ఇదివరకు సింగర్ కార్తీక్ కూడా సంగీత దర్శకుడిగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మరి మన సీడ్ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా సక్సెస్ అయ్యి.. అలాగే కంటిన్యూ అవుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













